మెట్ పల్లి మహా శివరాత్రి పండగ సందర్భంగా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కు సెలవులు ప్రకటించారు. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే మార్చి 2 ఆదివారం సెలవు కావడంతో, మార్చి 3వ తేదీ నుంచి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. రైతులు గమనించి సహకరించాలని కోరారు.