బంగారు గోపురాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
NEWS Feb 23,2025 01:21 pm
నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ ఖర్చుతో నిర్మించిన బంగారు గోపురాన్ని ప్రారంభించారు. సీఎం తన భార్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో పాల్గొన్నారు. సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేసి బంగారు గోపురాన్ని తయారు చేశారు, ఇది యాదగిరిగుట్ట ఆలయ గోపురం అందం, అలంకరణను మరింత పెంచుతుంది.