దుబాయ్ లో మ్యాచ్ చూసిన చిరంజీవి
NEWS Feb 23,2025 06:42 pm
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ లో జరుగుతున్న పాకిస్తాన్ , భారత క్రికెట్ మ్యాచ్ ను ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయనతో పాటు పుష్ప-2 పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఇంటర్నేషనల్ స్టేడియంలో తళుక్కున మెరిసారు. క్రీడా, పారిశ్రామిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ మ్యాచ్ ను చూడడం విశేషం. మ్యాచ్ లో భాగంగా తొలుత పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. షఫీ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.