నవాబుపేట మండలంలోని కేజీబీవీ పాఠశాలను ఎంపీడీవో జయరాం నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వంటగదిలో వెళ్లి తనిఖీ చేశారు. భోజన సదుపాయాలను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన తాజ కూరగాయాలతో పౌష్టికమైన ఆహారాన్ని అందించాలన్నారు. తరగతి గదిలో విద్యార్థుల శక్తిసామర్థ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.