గత 10 ఏళ్ళ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పీఎం ఉషా పథకం కింద మంజూరైన రూ.10 కోట్ల వ్యయంతో ఎంవిఎస్ కాలేజీ ఆవరణలో నిర్మించే బాలికల హాస్టల్ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. గత పాలకులు ప్రభుత్వ బడులను గాలికి వదిలేసి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.