రామలింగేశ్వరుడిని దర్శించుకున్న సీతక్క
NEWS Feb 23,2025 04:55 pm
ములుగు జిల్లా వేంకటాపూర్ మండలం లోని పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ నెల 26 నుండి 28 వరకు మహా శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు