8 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం
NEWS Feb 23,2025 10:18 am
ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి కొత్త పోస్టింగ్ లు ఇచ్చింది. బదిలీ అయిన వారిలో పి విశ్వ ప్రసాద్ (అదనపు సిపి క్రైమ్స్), డాక్టర్ బి నవీన్ కుమార్ (ఎస్పీ సిఐడి), డాక్టర్ గజురావు భూపాల్ (జాయింట్ సిపి ట్రాఫిక్ సైబరాబాద్), డి జోయెల్ డేవిస్ (జాయింట్ సిపి హైదరాబాద్), సిరిశెట్టి సంకీర్త్ (గవర్నర్కు ఎడిసి), బి రామ్ రెడ్డి (ఎస్పీ సిఐడి), సిహెచ్ శ్రీధర్ (ఎస్పీ ఇంటెలిజెన్స్) ఎస్ చైతన్య కుమార్ (డిసిపి ఎస్బీ హైదరాబాద్) ఉన్నారు.