గ్రూప్-2 మెయిన్స్ యథాతథం
NEWS Feb 23,2025 08:52 am
ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన చేసింది. తప్పుడు ప్రచారం నమ్మవద్దని, గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష యథాతథం జరుగుతుందని స్పష్టం చేసింది. పరీక్ష యథాతథంగా జరుగుతుందని వెల్లడించింది. అభ్యర్థులు అపోహలు నమ్మవద్దని కోరింది. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించింది. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది.