జాతీయ లోక్ అదాలతు సద్వినియోగం చేసుకోవాలి: సివిల్ జడ్జి
NEWS Feb 22,2025 11:29 pm
మెట్ పల్లి కోర్టు ఆవరణలో మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు కోరారు. కక్షిదారులు సివిల్, క్రిమినల్ భూతగాదా కేసులు, వరకట్నం, మెయింటెనెన్స్, గృహహింస, చెక్ బౌన్స్ తదితర కేసులను రాజీ చేసుకొని కేసుల నుంచి విముక్తి పొందాలని సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్, డిఎస్పీ రాములు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై కిరణ్ కుమార్ న్యాయవాదులు తదితరులున్నారు.