బీసీ కుల గణన అనేది ఒక సాహసోపేత నిర్ణయమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్రికరణ శుద్దిగా లెక్క తేల్చామని చెప్పారు. వందేళ్లలో జరగనిది తాము 100 శాతం సరైన లెక్కలు తేల్చామని స్పష్టం చేశారు. బీసీ కుల గణనకు సంబంధించిన నివేదికపై సమీక్ష చేపట్టారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాలను పాటించానని అన్నారు. తప్పుడు లెక్క అనే వారిది తప్పుడు మాట అన్నారు రేవంత్ రెడ్డి.