నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకి 7 వేల కోళ్లు మృతి చెందాయి. జిల్లాలోని కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ శివారు లోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో ఘటన చోటు చేసుకుంది. మరణించిన కోళ్లను జేసీబీ సాయంతో పూడ్చి పెట్టాడు యజమాని. 13 వేల కోళ్లను కొనుగోలు చేస్తే అందులో చాలా కోళ్లు మృత్యువాత పడ్డాయని, రూ. 4 లక్షలకు పైగా నష్టం జరిగిందంటూ వాపోయాడు ఓనర్.