మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి
NEWS Feb 22,2025 03:02 pm
మెట్ పల్లి పట్టణంలో భారతరత్న స్వతంత్ర సమరయోధులు ప్రథమ విద్యాశాఖ మంత్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కాంగ్రెస్ భవన్ లో జువాడి నర్సింగ్ రావు నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికల ఇంచార్జ్ వరంగల్ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎన్నికల కోఆర్డినేటర్ భాస వేణు యాదవ్, టిపిసిసి కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ అవెజ్, ఇన్చార్జి అబ్దుల్ జాకీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు