రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం
NEWS Feb 22,2025 02:11 pm
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. దారుణంగా ఉందని వాపోయారు. గత ప్రభుత్వం లెక్కకు మించిన అప్పులు చేశారని , ఆ భారం ప్రస్తుత కూటమి సర్కార్ పై పడిందన్నారు. ఏపీ ఖజానా అంతా ఖాళీ అయ్యిందని, దానికి తోడు విపరీతంగా అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు.