సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి
NEWS Feb 22,2025 12:17 pm
MBNR: రాజాపూర్ మండలంలోని పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సృజనకు వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ నేతలు మాట్లాడుతూ.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మహమ్మద్ యూసఫ్, నరసింహారెడ్డి, వెంకట రాజ్యం, ఆంజనేయులు, మల్లయ్య పాల్గొన్నారు.