బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వానం
NEWS Feb 22,2025 08:59 am
యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి ఆలయంలో జరిగే స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం, బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు పూజారులు. ఈ సందర్బంగా స్వామి వారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. పూజారులు, ఆలయ అధికారులను శాలువాలతో సత్కరించారు కేసీఆర్.