ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా చాగంటి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో ములుగు జిల్లా కేంద్రానికి చెందిన టి జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బాలికలు విజేతలుగా నిలిచారు. వీరిలో 9వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ మొదటి బహుమతి సాధించగా, ఎనిమిదో తరగతి చదువుతున్న అస్మిక రెండో విజేతగా రజత పథకం సాధించింది. మూడో విజేతగా పల్లవి కాంస్య పథకం సాధించగా ప్రిన్సిపాల్ నర్మదా భాయ్ విద్యార్థులను అభినందించారు.