మంత్రి కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు జగన్ రెడ్డిపై. ఆయన ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగాలు అవసరం లేదన్నారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో జగన్ అసెంబ్లీకి రాకుండా మొఖం చాటేశాడని ధ్వజమెత్తారు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపాడన్నారు. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా అంటూ ప్రశ్నించారు. ప్రజలు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిల్చోపెట్టిన జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు.