గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 18005994007 టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ హైదరాబాద్ మిషన్ భగీరథ హెడ్ ఆఫీసులో ఈ టోల్ ఫ్రీ నంబర్ 24/7 పనిచేస్తుంది. ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులున్నా ఈ నెంబర్ కు కాల్ చేయండి.