ములుగు జిల్లాలో చికెన్ ధరలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. ఆంధ్రలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి లక్షల కోళ్లు మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో సైతం బాయిలర్ కోళ్లను తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. దీంతో ములుగు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కేజీ (స్కిన్) రూ.150, స్కిన్ లెస్ రూ.180 ఉండగా, హోల్ సెల్ (కోడి) రూ.100 రిటైల్ రూ.80 చొప్పున నేడు శుక్రవారం రోజున విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ధరల్లో తేడా ఉంది.