సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించాలి
NEWS Feb 21,2025 02:15 pm
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్ పాషా డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు కు వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాలలో పత్తి పంట సాగు అవుతుందని, గత వారం రోజులుగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు నిలిపి వేశారని, దీంతో గ్రామాల్లో దళారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని అన్నారు.