కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్
NEWS Feb 21,2025 11:25 am
మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. గజ్వేల్ నుంచి ఎన్నికైనా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ ను విజయ్ పాల్ రెడ్డి దాఖలు చేశారు. కేసీఆర్ కు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు వేతనంగా చెల్లిస్తున్నారని, వాటిని కూడా రికవరీ చేయాలని కోరారు. ఈ మేరకు కోర్టు స్పీకర్ ను కేసీఆర్ పై వేటు వేసేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.