ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్యులపై వేటు
NEWS Feb 21,2025 10:40 am
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లోకాయుక్త ఆదేశాల మేరకు తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో 9 మంది వైద్యులను తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎం. వెంకట రావు, వి. సరస్వతి, బి. కిరణ్ కుమార్, కె. మధురిమ నాయుడు, పి. నళిని, బి. చంద్రశేఖర్, కె. లావణ్య, ఏ. కార్తీక్, ఈ. శ్రీకాంత్ ను తొలగించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొత్తం 55 మంది డాక్టర్లపై వేటు వేసింది సర్కార్.