శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు
NEWS Feb 21,2025 10:21 am
తిరుమల శ్రీవారిని 59 వేల 776 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 386 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు వచ్చిందని వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.