బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ వే పై చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ బుర్ద్వాన్ కు వెళ్తుండగా చోటు చేసుకుంది. సౌరవ్ గంగూలీ కాన్వాయ్ ముందు ఉన్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్న గంగూలీ కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో సడన్ గా ఆగి పోయింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డాడు మాజీ కెప్టెన్.