హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) బిగ్ షాక్ ఇచ్చింది. నగరంలోని బంజారా హిల్స్ లో ఉన్న తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేసింది. గత రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది జీహెచ్ఎంసీ. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేశామని, అయినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.