రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రీచ్ ల నుంచి ఇసుకను తీసుకొచ్చి నగరంలో డంప్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు వంటి అభివృద్ది కార్యక్రమాలకు ఇసుక చాలా అవసరమన్నారు. ఇసుకను అక్రమంగా డంప్ చేసినా , రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా సీపీ చేసిన కామెంట్స్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పడుతున్నాయి.