నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో 72,045 ఇందిరమ్మ ఇళ్లకు ఈనెల 21న శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇళ్లు లేని కుటుంబాలకు నివాసం ఉండేలా చేయాలనేది తమ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు సీఎం. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. బేస్ మెంట్ కట్టగానే లబ్దిదారుడి ఖాతాలోకి రూ. లక్ష జమ చేస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేసింది సర్కార్.