కోరుట్ల పట్టణంలోని శివారులోని ఏసుకొనిగుట్ట ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను ఆర్డీవో జీవాకర్ రెడ్డితో కలిసి కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీని సీజ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మట్టి ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమంగా చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.