కోరుట్ల మున్సిపాలిటీ లో తనిఖీలు చేసిన కలెక్టర్
NEWS Feb 20,2025 07:55 pm
కోరుట్ల మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులు, రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో జీవాకర్ రెడ్డి, ఎమ్మార్వో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.