అభ్యర్థి గెలుపునకు. బీజేపీ నేతల ప్రచారం
NEWS Feb 20,2025 07:56 pm
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరుతూ మెట్పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలువురు వైద్యులను కలిసి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొడ్ల రమేష్, నాయకులు సుంకేట విజయ్, మిట్టపల్లి కృష్ణమూర్తి, శ్రీకర్ గౌడ్ పాల్గొన్నారు.