తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహిళా సభ్యత్వాలు లక్ష దాటాయి. ఈ సందర్బంగా గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్బంగా సునీతా రావును ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ హయాంలో మహిళలను అవమానించారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక రాష్ట్రంలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛ లభించిందని అన్నారు. సీఎం ఆధ్వర్యంలో పాలన సూపర్ గా ఉందన్నారు.