హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి
NEWS Feb 20,2025 04:48 pm
భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తికి సంబంధించి భార్య, బిడ్డల సాక్ష్యాలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, గండ్ర వెంకట రమణా రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని, దీనికి కారణం కేసీఆర్, హరీశ్ రావు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజలింగం మూర్తి.