రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని పెగ్గర్ల రమేష్ రావు కోళ్ల ఫామ్ లో కోళ్లు మరణిస్తూ ఉన్నాయి. రెండు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పటి వరకూ ఈ ఒక్క ఫామ్ లోనే 2500 కోళ్లు మరణించాయి. అంతకు ముందు మరో వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. భారీ స్థాయిలో కోళ్లు చనిపోతుండడంతో ఇవి బర్డ్ ఫ్లూ కారణంగానే చనిపోతున్నట్టు స్థానికులు భావిస్తున్నారు. అధికారులు ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.