యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 23న మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం చేసిన సందర్బంగా కుంభాభిషేకం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరవుతారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉందని , అనుమతి తీసుకున్నామని చెప్పారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉందన్నారు.