శ్రీశైల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS Feb 20,2025 11:27 am
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి శ్రీశైలంలో. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామి , అమ్మ వార్లకు విశేష పూజలు చేపట్టారు. భృంగి వాహన సేవతో పాటు లోక కళ్యాణం కోసం రుద్ర హోమం, చండీ హోమం, జపాలు, పారాయణాలు కొనసాగుతున్నాయి. టీటీడీ, ద్వారకా తిరుమల తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. గ్రామోత్సవం చేపట్టారు. జానపద కళా రూపాల ప్రదర్శన ఆకట్టుకుంది.