హైదరాబాద్ వేదికగా మొట్టమొదటిసారి మిస్ వరల్డ్ వేడుకలు జరగనున్నాయి. 72వ మిస్ వరల్డ్ వేడుకలను ఇక్కడ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలను రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ శాఖకు స్మితా సబర్వాల్ కార్యదర్శిగా ఉన్నారు. భారీ ఎత్తున ఖర్చు చేయనుంది సర్కార్.