కథలాపూర్ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని ఎస్ఐ నవీన్ రాత్రి 11 గంటలకు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లారీని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేయడం జరిగింది. రాత్రి సమయంలో ఇసుక లారీలు నడపడం వలన ఎదురుగా వస్తున్న వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వాహనదారులు పేర్కొన్నారు దీనిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ నవీన్ కు తెలుపగా వారు స్పందించి రాత్రి ఎటువంటి లారీలు వచ్చిన వారిని తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగినట్లు తెలిపారు.