గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ని సన్మానించిన జువ్వాడి
NEWS Feb 20,2025 08:16 am
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రియాజ్ మొట్ట మొదటిసారిగా కోరుట్ల వచ్చారు. ఆయన్ను కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నయీమ్, గంగాధర్,అవేజ్,నియోజకవర్గ యువజన నాయకుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నాగభూషణం పాల్గొన్నారు.