రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.