వెంకటాపురం మండలం సుడిబాక తోగు గ్రామ శివారులోనీ మొక్కజొన్న పంటలో హైనా కలకలం రేపింది. మొక్కజొన్న పంటను కోతుల బెడద నుంచి కాపాడు కోవడానికి కుక్కనీ కాపలాగా పెట్టిన రైతు పూనం శుక్రామ్ ఉదయాన్నే పంటపొలానికి రాగా చనిపోయిన కుక్క చూసి భయబ్రాంతులకు గురై అక్కడ ఉన్న పాదముద్రలను చూసి పెద్ద పులి అనుకొనీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి అధికారులు వచ్చి పాదముద్రలు పరిశీలించి హైనా గా గుర్తించారు. గ్రామస్థులు ఎవరూ కూడా ఒంటరిగా పంట పొలాల్లోకి రావద్దని హెచ్చరించారు.