రూ. 2.43 లక్షల కోట్ల ఒప్పందం
NEWS Feb 19,2025 10:01 am
భారత్, ఖతార్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద డీల్ కుదరడం ఇదే మొదటిసారి. ఇరు దేశాలు కలిసి ఏకంగా రూ. 2.43 లక్షల కోట్లు అంటే 28 బిలియన్ డాలర్లకు తీసుకు వెళ్లాలని నిర్ణయించాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని మధ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి.