కుంభ మేళాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
NEWS Feb 18,2025 09:12 pm
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య, కొడుకుతో కలిసి త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు చేశారు. గంగా, యమున, సరస్వతి పవిత్ర నదుల సంగమంలో స్నానం చేయడం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. భార్య అన్నా లెజ్నెవా, పెద్ద కుమారుడు అకిరా నందన్ దీపాలను వెలిగించారు. సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం.