తెలంగాణ రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గండి హనుమాన్ వద్ద పోలీసు, రెవెన్యూ శాఖలు చెక్పోస్టును ఏర్పాటు చేశాయి. ఈ చెక్పోస్టు ద్వారా ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు 24 గంటల పాటు కఠినంగా పర్యవేక్షణ జరుగుతోంది. అక్రమ రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎస్ఐ.