ఎమ్మెల్సీ అభ్యర్థుల తరఫున ప్రచారం
NEWS Feb 18,2025 09:16 pm
ఆత్మకూర్ గ్రామంలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థుల తరఫున పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే నిరుద్యోగుల, ఉద్యోగుల తరఫున పోరాటం చేస్తారన్నారు. నవీన్, రాజ్ పాల్, సాగర్, సురేశ్, రవి, భూమేష్, సాయిరెడ్డి, సంజీవ్ తదితరులున్నారు.