ఏసిబికి పట్టుబడ్డ పోలీసు అధికారులు
NEWS Feb 18,2025 09:18 pm
ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.