రైతులకు విద్యుత్ కెపాసిటర్పై అవగాహన
NEWS Feb 18,2025 08:07 pm
విద్యుత్తు పొలం బాటలో భాగంగా జగ్గన్నపేట గ్రామశివారు రైతులతో విద్యుత్తు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కెపాసిటర్ బిగించడం వలన కలిగే లాభాలు, ఎలక్ట్రికల్ పరికరాలకు ఎర్తింగ్ పద్ధతులను అందించడం వలన రక్షణ పొందడం,ఇంటిలోని విద్యుత్తు పరికరాలను తడి చేతులతోని ముట్టుకోకుండా సూచనలు, ఛార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడడం వలన కలిగే ప్రమాదాలు, తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి సర్కిల్ డిఇఇ టెక్, ములుగు డిఇఇ, ADE, AE విద్యుత్తు సిబ్బంది పాల్గొన్నారు.