సద్గురు సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి సందర్భంగా ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో బంజారాల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ హాజరై సేవాలాల్ మహారాజ్ గొప్పతాన్ని తలుచుకుంటూ చేసుకునే ఇలాంటి పండగలు జరుపుకోవడం చాలాసంతోషంగా ఉందన్నారు. పత్తిపల్లిగ్రామంలో మొదటి సరిగానిర్వహిస్తున్న సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా గుడి నిర్మాణం కోసం మంత్రి సీతక్క తో చర్చించి గుడి నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు చేయించడంలో కృషి చేస్తానన్నారు.