బస్టాండ్ను అభివృద్ధి చేయాలని వినతి
NEWS Feb 18,2025 08:06 pm
గంగాధర ఎక్స్ రోడ్లోని బస్టాండులో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు సామాజిక కార్యకర్త కాసిపాక అరవింద్. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. బస్టాండ్ లో ఉన్న పలు సమస్యలతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారని, సీసీ రోడ్డు లేక దుమ్ము ధూళితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, తాగునీరు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.