బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వచ్చింది తామేనని , అందుకే తమకు పూర్తి హక్కు ఉందన్నారు. తెలంగాణ ఊరికే రాలేదన్నారు. పోరడితే, బలిదానాలు చేసుకుంటే వచ్చిందన్నారు. తాము పేగులు తెగే దాకా కొట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. టైమ్ పాస్ చేస్తే రాలేదని తెలుసుకుంటే మంచిదన్నారు. చిల్లర మాటలు మాట్లాడే వాళ్లను జనం పట్టించు కోరని అన్నారు. ఉద్యమంలో పాల్గొనని వారికి తమను విమర్శించే అర్హత లేదన్నారు.