బేస్తవారిపేట మహిళా అధ్యక్షురాలుగా స్వర్ణలత
NEWS Feb 18,2025 09:27 am
కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి గిద్దలూరు నియోజకవర్గ కాపు నాయకులు, బెస్తవారిపేట మహిళా అధ్యక్షురాలు మన్నెపల్లి స్వర్ణలత తెలిపారు. రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న మన్నెపల్లి స్వర్ణలత తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన గిద్దలూరు నియోజకవర్గ కాపు నాయకులకు, రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.